టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు చాలా వరకు సినిమాల్లో కొత్తదనం అనేది కోరుకుంటున్నారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం పదే పదే వింటూ వస్తున్నాం. కథలో మార్పులు చేసుకోవాలి అని వారు సోషల్ మీడియా వేదికగా హీరోలకు కూడా సూచనలు చేస్తూ వస్తున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ లో చాలా వరకు కూడా సినిమాల్లో ఉండే కథలకు సంబంధించి హీరోలు జోక్యం చేసుకుంటున్నారు అని టాక్. అవును హీరోలు కథలను పూర్తిగా మారుస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పూర్తిగా కథను మార్చాలి అని చెప్పాడు అనీ సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా సినిమా యూనిట్ చేసే సూచనలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ ని అతను వద్దు అని చెప్పాడు అని అంటున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేసే సినిమాకు సంబంధించి దాదాపుగా అదే సూచన చేసాడు అని టాలీవుడ్ లో టాక్ మరి. దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా కథల విషయంలో చాలా వరకు మార్పులు అడగారు అని అంటున్నారు. 

 

చివరికి చిరంజీవి కూడా ఆచార్య సినిమాకు సంబంధించి చాలా  వరకు మార్పులు అడిగారు అని టాక్. దీనికి దర్శకుడు కొరటాల శివ కూడా ఓకే చెప్పారు అని అంటున్నారు. ఈ సినిమాలో చాలా వరకు కూడా మార్పులు చేసారు అని అంటున్నారు. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కొన్ని మార్పులను క్రిష్ సినిమాకు సంబంధించి చేసాడు అని దానికి క్రిష్ కూడా ఓకే చెప్పారు అని టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: