కరోనా కారణంగా సినిమా షూటింగులకి మూడు నెలలపాటు ఫుల్ స్టాప్ పడింది. లాక్డౌన్ వల్ల మూడు నెలలు టీవీ సీరియళ్ళు, ప్రోగ్రామ్స్ కూడా ఆగిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే చిత్రీకరణలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో టీవీ ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటిగా మొదలు కానున్నాయి. అయితే తెలుగు టెలివిజన్ పై బాగా ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ కూడా మొదలు కానుందట. ఇప్పటి వరకూ మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో నాలుగవ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది.

 

మూడవ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున నాలుగవ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ షో కి ఉన్న పాపులారిటీ కారణంగా ఈ షోలో కంటెస్టెంట్ గా రావడానికి ప్రతీ ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో కంటెస్టెంట్లుగా ఎవరొస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

 

మొన్నటికి మొన్న శ్రద్ధా దాస్, హంసా నందినీ, ప్రియా వడ్లమాని, యామినీ భాస్కర్ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మరో సెలెబ్రిటీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ ప్రముఖ సెలెబ్రిటీ ఎవరో కాదు.. యాంకర్ లాస్య. తెలుగు బుల్లితెరపై ఢీ డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ లాస్య బిగ్ బాస్ 4 లో కనిపించనుందట. అయితే యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లాస్య కొద్దిరోజులుగా యాంకరింగ్ చేయట్లేదు.

 

పెళ్ళయినప్పటి నుండి యాంకరింగ్ కి దూరంగ ఉంటూ, అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ ఉంది. మరి ప్రస్తుతం వస్తున్న వార్తలు నిజమైతే యాంకర్ లాస్యకి మరోమారు టెలివిజన్ తెరపై మంచి పాపులారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి యాంకర్ లాస్యకి ఆ అవకాశమ్ వస్తుందో లేదో..!

మరింత సమాచారం తెలుసుకోండి: