రవితేజ ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ రావడం లేదు. సూపర్ స్టార్ డమ్ తెచ్చి పెట్టిన మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ మధ్య వర్కవుట్ కావడం లేదు. వరుస ఫ్లాపులతో మాస్ మహారాజ్ మార్కెట్ మొత్తం పడిపోతోంది. దీంతో ఈ సారి జానర్ మారుస్తున్నాడు రవితేజ. కెరీర్ ను గట్టెక్కించుకోవడానికి పీరియాడికల్ కోటింగ్ ఇస్తున్నాడు రవితేజ. 

 

రవితేజ సక్సెస్ చూసి చాలా రోజులవుతుంది. మూడేళ్లుగా ఫ్లాపులతోనే ట్రావెల్ చేస్తున్నాడు. ఎంత కష్టపడినా మాస్ మహారాజ్ ని పరాజయాలు విడిచిపెట్టడం లేదు. దీంతో ఎలాగైనా సరే, ఫెయిల్యూర్స్ నుంచి బయటపెట్టడానికి జానర్ మారుస్తున్నాడు రవితేజ. మాస్ కమ్ పీరియాడికల్ డ్రామాతో సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు రవితేజ. 

 

రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు వరుస ఫ్లాపులొచ్చాయి. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజాతో షాకులు తిన్నాడు రవితేజ. ఇక ఈ ఫ్లాపులతో రవితేజ మార్కెట్ మొత్తం పడిపోయింది. స్టార్ రేస్ లో వెనకబడిపోయాడు. ఇక కెరీర్ నిలబెట్టుకోవాలంటే కంపల్సరీగా హిట్ కొట్టాల్సిన టైమ్ లో క్రాక్ సినిమాకు సైన్ చేశాడు. ఈ మాస్ యాక్షన్ మూవీతో పాటు, ఓ పీరియాడికల్ స్టోరీకి కమిట్ అయ్యాడు రవితేజ. 

 

రవితేజ నెక్స్ట్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మాణం కాబోతున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామా అనే సమాచారం వస్తోంది. క్రాక్ తర్వాత ఈ  పీరియాడికల్ స్టోరీ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. మరి జానర్ మారితే అయినా రవితేజ ఫేట్ మారుతుందా అనేది చూడాలి. 

 

రవితేజకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. కుర్రాళ్లంతా ఆయన సినిమా ఎపుడొస్తుందా అని చకోరపక్షిలా ఎదురు చూస్తున్నారు. మాస్ మహారాజా సినిమాలు ఎపుడు కంప్లీట్ అవుతాయి.. ఎపుడు కరోనా మహమ్మారికి అంతమొస్తుంది.. ఎపుడు థియేటర్లు ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: