అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూడు సినిమాలు చేసినా కమర్షియల్ గ మాత్రం హిట్టు కొట్టలేదు. లేటెస్ట్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఓ ఫ్లాప్ డైరక్టర్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇంతకీ అఖిల్ చేయబోతున్న డైరక్టర్ ఎవరంటే వీరు పోట్ల అని తెలుస్తుంది. బిందాస్ సినిమాతో డైరక్టర్ గా మారిన వీరు పోట్ల రగడతో మెప్పించగా దూసుకెళ్తా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు.

 

2016లో ఈడు గోల్డ్ ఎహే సినిమా చేసిన వీరు పోట్ల.. ఆ సినిమాతో నిరాశపరచాడు. సునీల్ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా అతన్ని కెరియర్ లో వెనుకపడేలా చేసింది. మూడేళ్లుగా డైరక్టర్ గా ఛాన్సులు లేని వీరు పోట్ల అఖిల్ కోసం ఓ సూపర్ స్టోరీ సిద్ధం చేశాడట. అఖిల్ కు కథ వింపించడం వీరు పోట్ల స్క్రిప్ట్ కు అఖిల్ ఓకే చెప్పడం జరిగిందట. బ్యాచ్ లర్ సినిమా తర్వాత వీరు పోట్ల డైరక్షన్ లోనే అఖిల్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే అఖిల్ ఫ్లాప్ డైరక్టర్ కు ఛాన్స్ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. హిట్ ఫాం లో ఉన్న డైరక్టర్ అయితే సినిమాపై అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉండొచ్చు ఇలా ఫ్లాప్ డైరక్టర్ తో చేస్తే ఎలా అని అంటున్నారు.

 

అసలైతే అఖిల్ తన నెక్స్ట్ సినిమాను మిత్రన్ డైరక్షన్ లో చేయాలని అనుకున్నారు. కాని ప్రయోగాత్మక సినిమాలు చేసే మిత్రన్ డైరక్షన్ లో సినిమా అంటే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందో లేదో అని వెనక్కి తగ్గాడు అఖిల్. అందుకే అఖిల్ మిత్రన్ ను కాదని వీరు పోట్లతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.   

మరింత సమాచారం తెలుసుకోండి: