స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ ఇండస్ట్రీ హిట్ అల.. వైకుంఠపురములో పై బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా ప్రశంసలు కురిపించాడు. రెండు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమాను చూసిన ఆయన.. సినిమా అద్భుతంగా వుంది,సినిమాను పూర్తి థియేటర్‌లో చూడకపోవడం జీవితాంతం విచారం కలిగిస్తుంది. ఈమహమ్మారిని ఓడించి,ఈచిత్రాన్ని వీలైనంత తొందరగా చూడండి అని సంజయ్ ట్వీట్ చేశాడు. దీనికి అల్లు అర్జున్ కూడా రిప్లై ఇచ్చాడు. థాంక్యూ యు సంజయ్ గారు. మీకు సినిమా నచ్చినందుకు సంతోషం అని బన్ని ట్వీట్ చేశాడు. 
ఇక ఈట్వీట్ కు సంజయ్ గుప్తా రిప్లై ఇచ్చాడు.. బ్రదర్ మీనటనకు నేను పూర్తిగా ముగ్ధుడైయ్యాను. మీరు నన్ను నవ్వించారు, ఏడిపించారు. నేను మీ ఫ్యాన్‌బాయ్ ని.. మీతో కలిసి పనిచేసే అవకాశం కోసం వేచి ఉండలేనని సంజయ్ ట్వీట్ చేశాడు.
ఇక ఈడైరెక్టర్ హిందీలో కాబిల్ ,షూట్ అవుట్ తదితర సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం జాన్ అబ్రహం ,కాజల్ తో సంజయ్ గుప్తా.. ముంబై సాగ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదిలావుంటే అల్లు అర్జున్,వైకుంఠపురములో తరువాత పుష్ప లోనటించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈచిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: