కళాశాల మూవీని డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ తన సెకండ్ మూవీగా వైఎస్సార్ జీవిత కథతో యాత్ర సినిమా చేశాడు. ముఖ్యంగా వైఎస్ పాదయాత్ర నేపథ్య కథతో వచ్చిన యాత్ర ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత యాత్ర 2 చేస్తాడని ఎనౌన్స్ చేయగా అది ఎదుకో వాయిదా పడ్డది. ఇక లేటెస్ట్ గా యాత్ర డైరక్టర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. రంగస్థలం తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమాగా పుష్పపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

ఇక తన నెక్స్ట్ సినిమా వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా ఎనౌన్స్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఐకాన్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్ని మహి వి రాఘవ డైరక్షన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. అసలు ఎవరు ఊహించని ఈ కాంబో సినిమా అనగానే కచ్చితంగా సినిమా అంచనాలను సృష్టిస్తుంది. యాత్ర సినిమాను బాగా హ్యాండిల్ చేసిన మహి వి రాఘవ ఈసారి స్టార్ డైరక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నాడు.

 

అల్లు అర్జున్ ఈమధ్య కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. నా పేరు సూర్య తర్వాత చాలా కథలు విన్న బన్ని త్రివిక్రం సబ్జెక్ట్ ను మాత్రమే నమ్మి అల వైకుంఠపురములో సినిమా చేశాడు. ఆ సినిమా సక్సెస్ అవడంతో మళ్లీ కెరియర్ లో జోష్ అందుకున్నాడు బన్ని. అల్లు అర్జున్, మహి వి రాఘవ కాంబో సినిమాపై ఇండస్ట్రీలో కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి ఈ సినిమా గురించిన మిగతా అప్డేట్స్ త్వరలో బయటకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: