ఓవర్ వెయిట్ అనుష్క కెరీర్ కు అడ్డంకిగా మారింది. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఒప్పుకున్న నిశ్శబ్ధం మినహా మరో ఛాన్స్ దక్కలేదు. సీనియర్ హీరోలు సైతం.. బొమ్మాళిని పట్టించుకోవడం మానేస్తే.. ప్రభాస్ ఆదుకున్నాడు. ఫ్రెండ్ షిప్ తప్ప మరో రిలేషన్ లేదని చెప్పే ప్రభాస్ అనుష్కను మొత్తానికి ఆదుకున్నాడు. 

 

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు కేరాప్ అడ్రస్ గా నిలిచిన అనుష్క ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటోంది. రెండేళ్ల నుంచి నిశ్శబ్ధంను నమ్ముకుంటే.. ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఓటీటీలో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాతలు. రెండేళ్ల నుంచి ఈ ఒక్క మూవీతో సంపాదించిన రెమ్యునరేషన్ తప్ప మరో ఇన్ కమ్ లేదు. 

 

తనకంటే జూనియర్స్ పూజా.. రష్మిక.. కీర్తి సురేష్ సినిమాల మీద సినిమాలు చేసి.. కోట్లు వెనకేసుకుంటే.. అనుష్క సినిమాల్లేక.. గత సంపాదన చూసి తృప్తి పడుతోంది. ఐదేళ్ల క్రితం సైజ్ జీరో కోసం వెయట్ పెరగ్గా.. ఇప్పటి వరకు నార్మల్ కు రాలేకపోయింది. దీంతో..బొమ్మాళిని టాలీవుడ్ పట్టించుకోవడం మానేసింది. 

 

అనుష్కను తెలుగు ఇండస్ట్రీ మరిచిపోయినా.. ప్రభాస్ మాత్రం గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ దృఢమైనది.. మన్నికైనది. ఆ అనుబంధంతో బొద్దుగుమ్మకు ఛాన్సులిస్తున్నాడు ప్రభాస్. సొంత బేనర్ యువి క్రియేషన్స్ అనుష్క కోసం కథ రెడీ చేస్తోంది. గతంలో ఇదే బేనర్ ఆమెతో భాగమతి తీసింది. ఆ సినిమా దర్శకుడు అశోక్ కథ రాస్తున్నాడట. అనుష్కకు ఇండస్ట్రీలో చాలామంది సన్నిహితులు ఉన్నా.. అవసరానికి ఉపయోగపడుతూ.. ప్రభాస్ రియల్ ఫ్రెండ్ అనిపించుకున్నాడు. 

 

ఏది ఏమైనా ప్రభాస్, అనుష్కల స్నేహం ఎంతో పవిత్రంగా కొనసాగుతోంది. ఎవరు ఏమనుకున్నా సరే.. దానికి ధీటైన సమాధానం చెబుతూ జాగ్రత్తగా తమ ఫ్రెండ్ షిప్ ను కాపాడుకుంటున్నారు. చూద్దాం.. ముందు ముందు ఏం జరుగుతుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: