సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సంవత్సరం ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మహేష్. ఆ తర్వాత వంశీ పైడిపల్లి తో సినిమాని కాదనుకున్నాడు. అందుకు కారణం దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చకపోవడమే. ఇప్పుడు మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమా సర్కారు వారి పాట కి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతమందిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ..14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

 

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ఎంత వరకు నిజమన్నది అధికారకంగా చిత్ర యూనిట్ నుండి వెల్లడి కాలేదు. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. మరో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలని చిత్ర బృందం ఇంకా అధికారకంగా వెల్లడించాల్సి ఉంది.

 

అయితే తాజా సినిమాలో ఒక ముఖ్య పాత్ర బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ పోషించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గాని ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతోంది. భాగ్యశ్రీ ప్రభాస్ పూజా హెగ్డే నటిస్తున్న రాధే శ్యామ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆ పాత్ర మీద రెండు రకాల మాటలు వినిపిస్తున్నాయి. కొందరేమో ప్రభాస్ కి తల్లిగా నటిస్తుంది అని అంటుంటే మరికొందరేమో ప్రభాస్ కి సిస్టర్ గా నటిస్తుందని అంటున్నారు. 

 

ఇక భాగ్యశ్రీ ప్రభాస్ సినిమా చేస్తుందని కన్‌ఫర్మ్ అయినప్పటి  నుంచి తన గురించి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు వారి పాట సినిమాలో భాగ్యశీ మహేష్ బాబు కి తల్లిగా నటించబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే చిత్ర బృందం భాగ్యశ్రీని సంప్రదించగా తను పాజిటివ్ గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించేంత వరకు రూమర్ అనుకోవాల్సిందే. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. 2021 సమ్మర్ కి టార్గెట్ గా ఈ సినిమాని సిద్దం చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: