పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పూరి టూరింగ్ టాకీస్..పూరి కనెక్ట్స్ బ్యానర్స్ లో పూరి జగన్నాధ్..ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగు తమిళం హిందీ కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండకి జంటగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకు చిత్రీకరణ జరిగింది. ముంబై ధారావి లో చిత్రీకరణ జరుపుతూ కరోనా కారణంగా నిలిపివేశారు. 

 

IHG

అయితే త్వరలో ఈ సినిమాని పూరి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నారు. ముందుగా టాకీ పార్ట్ కాకుండా సాంగ్స్..ఫైట్స్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఎక్కువమంది ఆర్టిస్టులు సెట్ లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసమే పూరి ముందు ఈ షెడ్యూల్ ని ఇలా ప్లాన్ చేశాడట. ఇవి కంప్లీటయితే తక్కువ మంది ఆర్టిస్టులు ఉండే సీన్స్ ని పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం పూరి సెట్స్ కూడా సిద్దం చేయించారని తెలుస్తుంది.

 

IHG

అయితే ఇప్పుడు పూరిసినిమా విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి సినిమా హిట్ లో ముఖ్య పాత్ర పోషించారు మెలోడి బ్రహ్మ మణిశర్మ. దాదాపు పదేళ్ళుగా మణిశర్మ కి ఈ రేంజ్ హిట్ దక్కలేదు. అంతేకాదు ఈ పదేళ్ళలో ఈ మెలోడి బ్రహ్మ కి పెద్ద సినిమా ఏదీ రాకపోవడం ఆశ్ఛర్యకరం. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు మణిశర్మ. 

 

IHG

కొన్ని పెద్ద సినిమాలు చేస్తున్నారు. అలాగే పూరి ఫైటర్ కి సంగీతమందిస్తున్నారు. కాని ఇప్పుడు మణిశర్మ స్థానంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు కారణం కరణ్ జోహార్ అని సమాచారం. ఫైటర్ పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్ నుండి మ్యూజిక్ డైరెక్టర్ అయితే బెటరని చెప్పడంతో పూరి మణిశర్మ ని మార్చాలనుకుంటున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో పూరి టీం అధికారకంగా వెల్లడిస్తేనే తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: