నేటితరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారిగా మిలిటరీ మేజర్ గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇకపోతే దీని అనంతరం గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ హీరోగా నటించనున్నారు. మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 

అతి త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నాయి. ఇకపోతే మూడు నెలలుగా కరోనా కారణంగా మన దేశంలో లాక్ డౌన్ విధించడం, దానితో సినిమా షూటింగ్స్ కూడా నిలిచిపోవడంతో, మిగతా తారల మాదిరిగా మహేష్ బాబు కూడా పూర్తిగా తన ఇంటికే పరిమితం అయ్యారు. కొన్నేళ్ల క్రితం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ కలిగి ఉన్న సూపర్ స్టార్, ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, అలానే సినిమాల గురించిన విశేషాలను వాటి ద్వారా అభిమానులు, ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. 

ఇక లాక్ డౌన్ సమయంలో కూతురు సితార, కొడుకు గౌతమ్ లతో కలిసి సరదా సరదా ఆటలు ఆడుతూ, అలానే వారితో కలిసి పలు సినిమాలు చూస్తూ కాలాన్ని గడుపుతున్నారు మహేష్. ఇక వారి ఎంజాయిమెంట్ కు సంబందించిన పలు ఫోటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తున్న సూపర్ స్టార్, అంతకంతకు సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల ట్విట్టర్ లో 10 మిలియన్ల మైలు రాయిని అందుకున్న మహేష్, నేడు ఫేస్ బుక్ లో కూడా అదే ఫీట్ ని అందుకోవడం జరిగింది. మొత్తంగా సూపర్ స్టార్ మహేష్ కు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉండే క్రేజ్ నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పవచ్చు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: