టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి, మొదటి సినిమా ప్రాణం ఖరీదు నుండి మొన్నటి సైరా నరసింహారెడ్డి వరకూ కూడా అదే విధమైన గ్రేస్ తో తెలుగు ప్రేక్షకుల మెప్పుతో నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు. అప్పట్లో ఏ కోదండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కన ఖైదీ సినిమా అద్భుత విజయంతో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అందుకున్న చిరంజీవి, ఆ తరువాత హీరోగా పలు అవకాశాలు అందుకుని, వాటిని మంచి సక్సెస్ లుగా మలుచుకుంటూ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు అధిరోహిస్తూ టాలీవుడ్ లో తిరుగులేని మెగాస్టార్ గా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక ఇటీవల కొన్నేళ్ల క్రితం సినిమాలు ప్రక్కన పెట్టి రాజకీయాల్లో చేరిన మెగాస్టార్, ఆపై కొన్నేళ్ల అనంతరం 2017లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్ళి హీరోగా రీఎంట్రీ ఇచ్చారు. 

ఇకపోతే మొదటి నుండి తన అభిమానులతో మమేకమవుతూ వస్తున్న మెగాస్టార్, ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ తెరిచారు. ఇప్పటివరకు ఏదైనా విషయమై తన స్పందన తెలియచేయాలన్నా, లేదా తన సినిమా, వ్యక్తిగత విషయాలు ప్రేక్షకులు, అభిమానులతో పంచుకోవాలన్నా మీడియా, ప్రెస్ ద్వారా మాత్రం వీలయ్యేదని, అయితే ప్రస్తుతం తాను కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేయడంతో అందరికీ మరింతగా చేరువ అవ్వొచ్చని తన మొదటి పోస్ట్ లో మెగాస్టార్ తెలిపారు. ఇక కరోనా కారణంగా లాక్ డౌన్ విధించబడడంతో ఇంటికే పరిమితమయిన మెగాస్టార్, తన ఫ్యామిలీ మెంబెర్స్ కు ఇంటి పనుల్లో వీలైన సాయం చేస్తూ, అలానే వారితో ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ముందుకు సాగుతున్నారు. 

ఇకపోతే ఇటీవల బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా తన ఇంటి పనులు చేయడం, అలానే తల్లి అంజనమ్మకు స్వయంగా దోశలు వేయడం వంటివి మెగాస్టార్ చేయడం జరిగింది. కాగా మెగాస్టార్ చేస్తున్న ఆ పోస్టులకు పలువురు ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తోంది. మొత్తంగా సోషల్ మీడియాకి లేట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా తన పోస్టులతో మంచి క్రేజ్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: