మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితం అయిన చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని మెగాస్టార్ కు వారసుడిగా తన నటన, డ్యాన్స్ లతో ఆకట్టుకున్న చరణ్, ఆపై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాతో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి మంచి క్రేజ్, ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. 

ఇక ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలతో ముందుకు సాగుతున్న రామ్ చరణ్, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూశాడు. అయితే వాటితో ఏ మాత్రం కృంగిపోకుండా ముందుకు సాగిన చరణ్, ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా సూపర్ డూపర్ హిట్ తో ఆడియన్స్ తో మరొక్కసారి శభాష్ అనిపించుకున్నారు. ఇకపోతే కొన్నాళ్ల క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ ఓపెన్ చేసిన చరణ్, ఫ్యాన్స్ తో వాటి ద్వారా మరింతగా ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నారు. 

ఓ వైపు తన సినిమా సంగతులతో పాటు, మరోవైపు భార్య ఉపాసన, తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, నానమ్మ అంజనమ్మలతో కలిసి మొన్నటి లాక్ డౌన్ సమయంలో సందడి చేసిన పలు సంగతులను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులు, ప్రేక్షకులతో పంచుకుంటున్న రామ్ చరణ్ కు అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లోనూ మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. ఆ విధంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ సూపర్ యాక్టివ్ గా ఉంటూ కొనసాగుతున్న రామ్ చరణ్, ప్రస్తుతం మరొక నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి తీస్తున్న పేట్రియాటిక్ మూవీ రౌద్రం రణం రుధిరం సినిమాలో ఒక హీరోగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా 2021 జనవరి 8న రిలీజ్ కానుంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: