తమిళ స్టార్ హీరో సూర్య ,వెబ్ సిరీస్ లో నటించనున్నాడని కోలీవుడ్ మీడియా వెల్లడించింది. నవరస అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈసిరీస్ ను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం నిర్మించనున్నాడట. 9కథలతో ఈవెబ్ సిరీస్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తం 9మంది డైరెక్టర్లు ఈసిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారట అందులో భాగంగా మణిరత్నం, హీరో సిద్దార్థ ,అరవింద స్వామి అలాగే 180 డైరెక్టర్ జయేంద్ర తదితరులు ఈసిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఈవార్తలు నిజమైతే సూర్య వెబ్ సిరీస్ లో నటిచనుండడం ఇదే మొదటి సారి కానుంది. త్వరలోనే దీని గురించి క్లారిటీ రానుంది. 
 
ఇదిలావుంటే సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సురరై పోట్రు సెన్సార్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఓపెన్ కాగానే ఈసినిమాను విడుదలచేయనున్నారు. సుధా కొంగర డైరెక్షన్లో ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో విడుదలకానుంది. ఈసినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. 2డి ఎంటర్టైన్మెంట్స్, సిక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.   
 
ఇక సూర్య ప్రస్తుతం హరి డైరెక్షన్ లో అరువలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈచిత్రంలో సూర్య డ్యూయెల్ రోల్ లో నటించనుండగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించనుంది. అక్టోబర్ లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈసినిమాతో పాటు సూర్య మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒక సినిమాను విశ్వాసం ఫేమ్ శివతో చేయనుండగా మరొకటి అసురన్ ఫేమ్ వెట్రిమారన్ తో చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: