టాలీవుడ్ యువ సెన్సేషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరక్క్కుతుందని తెలుస్తుంది. అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఐదు భాషల్లో భారీగా రిలీజ్ ప్లాన్ చేశాడు పూరి. బాలీవుడ్ లో ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ రౌడీ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

 

సినిమాలో విలన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడని తెలుస్తుంది. పూరి సినిమాలో హీరోలే కాదు విలన్స్ కూడా పవర్ ఫుల్ గా ఉంటారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండని ఢీ కొట్టే విలన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడని తెల్స్తుంది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ మాత్రం కన్ ఫర్మ్ చేయలేదు. విజయ్, అనన్యా పాండేల రొమాన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని. కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ తప్పకుండా తన సత్తా చాటుతాడని అంటున్నారు.

 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటాడని తెలుస్తుంది. సినిమా టైటిల్ ఫైటర్ అని ప్రచారంలో ఉన్నా అన్ని భషలకు ఒకే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ రెండు సినిమాలు ఫ్లాప్ అవగా పూరి సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అన్ని కుదిరితే ఈ ఇయర్ ఎండింగ్ ఈ మూవీ రిలీజ్ ఉంటుంది. థియేటర్లు ఓపెన్ చేస్తే కాని సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియదు.        

మరింత సమాచారం తెలుసుకోండి: