రకుల్ ప్రీతి సింగ్ పేరు వినని వారు ఎవరు ఉండరు.తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఈ హీరోయిన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కూడా. కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తరవాత వెంకటాద్రి ఎక్సప్రెస్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.తరువాత టాలీవుడ్ లో బిజీ అయిపొయింది. టాలీవుడ్ లో మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున, గోపీచంద్ లాంటి స్టార్స్ తో రకుల్ నటించింది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా లోకూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది ఈ అమ్మడు. రకుల్ కి సోషల్ మీడియాలో 4.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే తన క్రెజ్ ఏ లెవెల్ లో ఉందో అర్ధం చేసుకోండి.అలాగే 14 మిలియన్ ఫాలోవర్స్ ఇన్ స్టాగ్రామ్ లో తనని ఫాలో అవుతారు కూడా.
రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనపై వచ్చే రూమర్స్, వార్తలపై నిత్యం స్పందిస్తూ ఉంటుంది. తప్పుడు వార్తలు రాస్తే వెంటనే సెటైర్స్ వేస్తుంది. అది తప్పని అందరికీ తెలిసేలా సోషల్ మీడియా లో పోస్ట్ పెడుతుంది. తాజాగా రకుల్పై ఆల్కహాల్ కొనుగోలు చేసిందని తప్పుడు వార్త రాయడం, ఆ వార్త హీరోయిన్ కంట పడటడం దానికి సింపుల్ గా ఓ వావ్, మెడికల్ షాపు వాళ్లు ఆల్కహాల్ అమ్ముతుంటారని నాకు తెలీదే అంటూ మెసెజ్ చేయడం జరిగింది. అలాగే ఇక ఎప్పుడూ వర్కవుట్లతో బిజీగా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కిచెన్లో సందడి చేసింది. హెల్తీ బనానా చాక్లెట్ ఓట్మీల్ కుకీస్ తయారు చేశారు.అభిమానులతో కూడా పంచుకున్నారు
తన జీవితంలో జరిగే ప్రతి సందర్భాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది రకుల్. తండ్రి చేత హెడ్ మసాజ్ చేయించుకున్న వీడియోను షేర్ చేస్తూ.. తండ్రీకూతుళ్లు ప్రేమను నెటిజన్లకు పరిచయం చేసింది.అలాగే కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మీతో ఇన్స్టా గ్రామ్ లో లైవ్లోకి వచ్చింది. అక్కడా ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది కూడా.ఏదన్నా సినిమా రిలీజ్ అప్పుడుగాని, ఫంక్షన్స్ అపుసు గాని వేరే హీరోలకు, హీరోయిన్స్ కు విషెస్ కూడా చెప్తూ డైలీ సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ లోనే ఉంటుంది రకుల్..