గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కి వెళ్ళి అక్కడ మంచి విజయాలని అందుకుంటున్నాయి. అందుకు పెద్ద ఉదాహరణ అర్జున్ రెడ్డి సినిమానే. సందీప్ వంగా రూపొందించిన ఈ సినిమా బాలీవుడ్ లో కబీర్ సింగ్ రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో హీరోగా నటించిన షాహిద్ కపూర్ కెరోర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ కానున్న సినిమాల్లో అల్లు అర్జున్ నటించిన డీజే కూడా ఒకటి.

 

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లని బాగానే కురిపంచింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి వసూళ్ళూ బాగానే వచ్చాయి. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుందని గతంలోనే వార్తలు వచ్చాయి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఈ సినిమా తెరకెక్కనుందని అన్నారు.

 

దిల్ రాజు స్వయంగా ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్ లో మరో ఇద్దరు హీరోల పేర్లు వినబడుతున్నాయి. అల్లు అర్జున్ పోషించిన పాత్రని చేసేందుకు మరో ఇద్దరు బాలీవుడ్ హీరోలు సుముఖంగా ఉన్నారట. వాళ్లెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోలైన టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్..

 

అంటే ప్రస్తుతం ఈ సినిమాలో నటించేందుకు ముగ్గురు హీరోలు ఉన్నారన్నమాట. మరి ఈ ముగ్గురు హీరోల్లో డీజే సినిమాలో ఎవరు కనిపిస్తారో చూడాలి. అల్లు అర్జున్ ని మరిపించేందుకు దిల్ రాజు ఎవరిని హీరోగా తీసుకుంటాడనేది ఆసక్తిగా మారింది. మరో విషయం హిందీ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ కే ఇవ్వాలని దిల్ రాజు భావిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: