మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరన్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం మెగాస్టార్ మళయాల చిత్రమైన లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. అయితే లూసిఫర్ రీమేక్ గురించి కొన్ని రోజులుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి.

 

 

ముఖ్యంగా ఈ సినిమా నటించే నటీనటుల గురించి అనేక కథనాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి చెల్లెలి పాత్రలో సుహాసినీ నటిస్తుందని, కాదు కాదు ఖుష్బూ అనీ, ఇలా రోజూ ఏదో ఒకటి వస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలో విలన్ పాత్రలో ఏ నటుడు నటించనున్నాడనేది ఆసక్తిగా మారింది. అయితే ఒరిజినల్ వెర్షన్ లో నటించిన వివేక్ ఓబెరాయ్ తెలుగు రీమేక్ లో నటిస్తాడని అన్నారు.

 

 

కానీ వివేక్ ఓబెరాయ్ ఈ పాత్రలో చేయట్లేదట. ఆల్రెడీ పోషించిన పాత్రలో మళ్ళీ కనిపించడం ఇష్టం లేక ఆయన ఒప్పుకోలేదట. అయితే ఇప్పుడు ఆ పాత్రలో ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్టు రహమాన్ చేయనున్నాడట. రహమాన్ ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి మంచి పాత్రలు చేసాడు. తెలుగులో చాలా సినిమాలు చేసిన రహమాన్ లూసిఫర్ రీమేక్ లో విలన్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఇప్పటికైతే అధికారిక సమాచారం రాలేదు.

IHG

 

సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కనుంది. ఇప్పటికే లూసిఫర్ స్క్రిప్టులో తెలుగు ప్రేక్షకుల తగినట్లుగా మార్పులు చేసాడట, ఆచార్య షూటింగ్ ముగియగానే మెగాస్టార్ ఈ చిత్ర షూటింగ్ ని స్టార్ట్ చేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: