ఈ మద్య ప్రపంచంలో కరోనాతో ఎన్నో కష్టాలు పడుతున్నారు జనాలు. ఇది సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. గత కొంత కాలంగా హాలీవుడ్, బాలీవుడ్ ని షేక్ చేస్తుంది కరోనా. ఇక బాలీవుడ్ లో అయితే వరుసగా కరోనా భారిన పడుతున్నారు. తాజాగా ఐదు రోజుల క్రితం అదృశ్యమైన హాలీవుడ్ ప్రముఖ నటి నయా రివీరా మృతదేహం పెరూలేక్లో తేలియాడుతూ కనిపించింది. కొద్ది రోజుల క్రితం నాలుగేళ్ళ కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని పెరూ లేక్లో బోటు షికారుకు వెళ్లిన నయా రివీరా(33) కుమారుడిని బోటులో వదిలేసి నదిలో దూకిన విషయం తెలిసిందే.
బోటు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం నదిలో శవమై తేలింది రివీరా. ఆమె మరణానికి కారణాలు ఏంటి అని తెలియాల్సి ఉంది. అందులో పిల్లాడు ఒక్కడే పడుకుని ఉండడంతో విస్తుపోయారు.
బోటులో లైఫ్ జాకెట్, రివీరా పర్సును గుర్తించారు. ఇక ఆ చిన్నారి అమ్మ, నేను స్విమ్మింగ్కి వెళ్ళాం. నేను తిరిగి వచ్చాను. అమ్మ రాలేదంటూ పిల్లాడు తన కుటుంబ సభ్యులకి తెలిపాడట.అయితే ఐదు రోజులు జల్లెడ పట్టిన తర్వాత నిన్న సాయంత్రం ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
The missing person at Lake Puru has been identified as Naya Rivera, 33, of Los Angeles. SAR operation will continue at first light. @VCAirUnit @fillmoresheriff @Cal_OES pic.twitter.com/bC3qaZS3Ra
— Ventura Co. Sheriff (@VENTURASHERIFF) July 9, 2020