బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాలపై జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంది. రోజు రోజుకి అతనికి క్రేజ్ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు అతను జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ని రాధే శ్యాం గా ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమా నాగ్ అశ్విన్ తో. యువ దర్శకుడు అయినా సరే నమ్మి ప్రభాస్ అవకాశం ఇచ్చాడు. ఇక నిర్మాత కూడా ఈ సినిమాకు స్టార్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాపై చాలానే చర్చలు జరుగుతున్నాయి. 

 

ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని ఈ సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇటీవల ఈ సినిమా కి  సంబంధించి హీరోయిన్ ని ఎంపిక చేసే విధంగా చర్చలు జరిగాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి దీపిక పదుకొనే అయితే బాగుంటుంది  అంటూ ప్రభాస్ తన అభిప్రాయం చెప్పగా దర్శక నిర్మాతలు అందుకు ఓకే చెప్పారు అని టాక్ మరి. 

 

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా భయంకరంగా కూడా ఉండే అవకాశం ఉంది అని  ప్రేమ తో పాటుగా అతను ఒక డాన్ గా కూడా కనపడే అవకాశం ఉంటుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులను కూడా తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి అసలు ఎం జరుగుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: