దేశంలో కరోనా తీవ్ర రోజు రోజుకీ పెరిగిపోతుంది. దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. కేసుల సంఖ్యలో తొమ్మిది లక్షల మార్కును దాటేసింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,498 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 553 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఈ మద్య బాలీవుడ్ ని కరోనా షేక్ చేస్తుంది. బిగ్ బీ కుటుంబ సభ్యులకు, అనుపమ్ ఖేర్ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రముఖ నటి రేఖ సిబ్బందికి కరోనా వచ్చిన విషయం తెలిసిందే.

 

ఇలా బాలీవుడ్ లో వరుస పెట్టి కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట్లో కూడా కలకలం రేపింది. రవికిషన్ పీఏకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు . నా దగ్గర పని చేస్తున్న పీఏ గుడ్డూ పాండే(42) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  దాంతో అతనికి కరోనా పరీక్షలు చేయించగా పాజిటీవ్ అని తేలిందని అన్నారు. తనిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

 

ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక తన పీఏకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే రవికిషన్‌ కూడా కరోనా టెస్ట్‌లు చేయించుకొని హోమ్ క్వారంటైన్‌కి వెళ్ళారు.  ఇక తన నియోజకవర్గంలో తప్పని సరి మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూస్తున్నామని అన్నారు.  అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నటుడు కిషన్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: