‘నాపేరు సూర్య’ వంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. దాదాపు సంవత్సరంన్నర ఎటువంటి సినిమా చేయకుండా చాలా స్టోరీలు విన్నాడు బన్నీ. 'నా పేరు సూర్య' సినిమాకి ముందు వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో దారుణమైన అట్టర్ ఫ్లాప్ పడటంతో నెక్స్ట్ సినిమా ఓకే చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. ఎట్టకేలకు గతంలో తనకు జులాయి, సన్నాఫ్ అఫ్ సత్యమూర్తి వంటి రెండు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ‘అలా వైకుంఠపురం లో’ సినిమా ని ఓకే చేయడం జరిగింది. గత ఏడాది లో ప్రారంభమైన ఈ సినిమా అతి తక్కువ టైమ్ లోనే అల్లు అర్జున్ కంప్లీట్ చేసి ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగకు రిలీజ్ చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 

చాలా టైమ్ తీసుకుని సినిమా చేసి సంక్రాంతి పండుగకు బాక్సాఫీసు దగ్గర ఉన్నా 'బాహుబలి' రికార్డులను మొత్తం తుడిచి పెట్టాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరస ప్రాజెక్టులతో బన్నీ బిజీ అవటానికి షెడ్యూల్ రెడీ చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. పూర్తి విషయంలోకి వెళ్తే సుకుమార్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' సినిమా ఒప్పుకున్నా బన్నీ రాబోయే రోజుల్లో మళ్లీ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారట.

 

అంతేకాకుండా కొరటాల శివ, 'యాత్ర' డైరెక్టర్ మహా వీ రాఘవ్ తో బన్నీ సినిమాలు ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా బయట పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉండటంతో బన్నీ సుకుమార్ సినిమా షూటింగ్ కోసం టైం తీసుకుంటున్నారట. వైరస్ కంట్రోల్ లోకి వచ్చిన వెంటనే వరుస వరుసగా ప్రాజెక్టులు మొదలు పెట్టి ఇండస్ట్రీలో బిజీ హీరోగా బన్నీ మారనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: