వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా షూట్ కొద్దిగా ఉన్నా టైములో కరోనా వైరస్ రావటంతో చివరి దశలో ఆగిపోయింది. ఒకవేళ కరోనావైరస్ రాకపోయి ఉంటే ఈ ఏడాది వేసవికి మే 15వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. ఒక్కసారిగా కరోనా వైరస్ రావటంతో పరిస్థితుల అని తల్లకిందులు అవ్వటంతో ‘వకీల్ సాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

IHG

దాదాపు రెండు సంవత్సరాలు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా అయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘విరాటపర్వం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సినిమాని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎ ఎం రత్నం సూర్య మూవీస్ బ్యానర్ పై పవన్సినిమా చేయనున్నారు. మొఘలుల కాలం నాటి సినిమా అని, ఓ వజ్రం చుట్టూ సినిమా స్టోరీ అల్లుకుని ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

IHG

కాగా ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని డైరెక్టర్ క్రిష్ సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో హీరోయిన్ పాత్ర యువరాణి కావటంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కాగా ఈ సినిమా అయిన వెంటనే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ విధంగా రీఎంట్రీ లో పవన్ వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: