టాలీవుడ్ లో ఒకప్పుడు మార్కెట్ అనేది ఒక రేంజ్ లో ఉండేది. ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఒక రేంజ్ లో హడావుడి ఉంటుంది అనే విషయం చెప్పాల్సిన పని లేదు. సినిమా గురించి ఏదోక వార్త సోషల్ మీడియాలో ప్రచారం అదే విధంగా ప్రధాన మీడియాలో ఉండే హడావుడి అన్నీ కూడా సినిమాను మరో రేంజ్ కి తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనే చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ లో చాలా వరకు మార్కెట్ విషయంలో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు భయపడుతున్నారు. ఇప్పుడు హడావుడి కూడా సోషల్ మీడియాలో చాలా వరకు తగ్గింది. 

 

అందుకే ఇప్పడు స్టార్ హీరోలు ఒక ప్లాన్ వేసారు అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అది ఏంటీ అంటే సోషల్ మీడియాలో ఇక నుంచి కొన్ని కొన్ని కార్యక్రమాలను చేయడానికి గానూ స్టార్  హీరోలు రెడీ అయ్యారు. తమ సినిమాల మార్కెట్ ని పెంచుకోవడానికి గానూ తమ గత సినిమాలకు సంబంధించిన వార్తలను విశేషాలను అప్పుడు జరిగిన తమ కొన్ని కొన్ని మంచి అనుభవాలను ఫాన్స్ తో పంచుకునే ప్రయత్నం స్టార్ హీరోలు చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ పెరగడం కోసం గానూ వాళ్ళు సినిమాల కోసం పడే కష్టం కూడా చెప్పడానికి రెడీ అయ్యారు. 

 

ముందు మహేష్ బాబు  తన మొదటి సినిమా కోసం పడిన కష్టం సోషల్ మీడియాలో చెప్ప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నారు.. . అదే విధంగా రామ్ చరణ్ కూడా చిరుత సమయంలో ఉన్న కొన్ని కొన్ని అనుభవాలను చెప్పే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు ఇదే బాట లో హీరోయిన్స్ కూడా వెళ్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: