ఇప్పుడు మన తెలుగు లో చాలా వరకు కూడా స్టార్ హీరోల సినిమాలు అనగానే స్టార్ హీరోయిన్ లు ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. వారు లేకుండా అసలు సినిమాలు ఉండే పరిస్థితి అనేది లేదు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు లాక్ డౌన్ లో బాగా ఇబ్బంది పడే వాతావరణం అయితే ఉంది అనే చెప్ప్పాలి. స్టార్ హీరోల విషయంలో ఇప్పుడు హీరోయిన్ లు కాస్త కఠినం గా ఉన్న నేపధ్యంలో వారి విషయంలో దర్శక నిర్మాతలు కూడా కఠినం గా ఉండటమే మంచిది అనే భావన లో ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

అవును ఇప్పుడు దాదాపుగా అదే ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల హీరోయిన్స్ అవసరం మేరకు ఎక్కువగా డిమాండ్ చేయడం తో వారిని పక్కన పెట్టాల్లి అని కొత్త వారిని తమ సినిమాల్లోకి తీసుకోవాలి అని భావిస్తున్నారు. మన తెలుగు లో ఇప్పుడు ఉన్న వాతావరణం ఆధారంగా చూస్తే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం అనేది  లేదు అనే చెప్పాలి. ఇప్పుడు రెండు మూడు సినిమాలకు సంబంధించి చాలా వరకు ప్రచారం జరుగుతుంది. హీరోయిన్స్ ఎక్కువగా డిమాండ్ చేసారు అని వారిని పక్కన పెట్టాల్లి అని చూస్తున్నారు అని. 

 

ఇప్పుడు వాస్తవం కూడా అలాగే ఉంది. పూజ ని ఒక సినిమా నుంచి తప్పించే అవకాశం ఉంది అని అంటున్నారు. అదే విధంగా రష్మిక ను కూడా తప్పించే ఆలోచనలో ఒక సినిమా యూనిట్ ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. రాబోయే రెండేళ్ళ పాటు తగ్గి చెయ్యాల్సిందే అని లేకపోతే మాత్రం అవసరం లేదు అని అంటున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. ఇప్పుడు ఒక రెండు సినిమాలకు సంబంధించి రష్మిక భారీగా డిమాండ్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: