టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ళ క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో హీరోగా కొన్నేళ్ల గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కొట్టి, మెగాస్టార్ బాక్సాఫీస్ పవర్ ఇంకా తగ్గలేదని నిరూపించింది. దాని తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి యావరేజ్ సక్సెస్ ని అందుకుంది. దాని అనంతరం ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరంజీవి. 

IHG

ఇక దీని తరువాత సాహో చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమాని మెగాస్టార్ చేయనున్నారు. ఇటీవల మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపొందిన లూసిఫర్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలో రానున్నట్లు సమాచారం. ముందుగా శర్వానంద్ తో తీసిన రన్ రాజా రన్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన సుజీత్, ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవడంతో, ఆయనకు రెబల్ స్టార్ ప్రభాస్ రెండవ సినిమా అవకాశం ఇచ్చారు. కాగా వారిద్దరి కాంబోలో ఇటీవల రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సాహో. 

 

అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో రూపొంది ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ ఆయిన ఈ యాక్షన్ మూవీ, బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని మాత్రమే దక్కించుకుంది. అలానే ఆ సినిమాకు సంబంధించి భారీ ఖర్చు మీద పెట్టిన శ్రద్ధ, కథ, కథనాలపై పెట్టలేదని దర్శకుడు సుజిత్ పై కొద్దిపాటి విమర్శలు కూడా వచ్చాయి. ఆ తరువాత ఇప్పటివరకు సుజిత్ కు మరొక సినిమా అవకాశం రాలేదు. ఇక అతి త్వరలో ఏకంగా మెగాస్టార్ తో సినిమా చేస్తుండడంతో, ఆయనే సుజిత్ కు హిట్ ఇవ్వాలని అంటున్నారు. మరి అతి త్వరలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న లూసిఫెర్ రీమేక్ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: