కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసాడు డైరెక్టర్ కొరటాల. 'భరత్ అనే నేను' లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దాదాపు కొద్ది నెలలు వెయిట్ చేసి చిరంజీవితో సినిమా స్టార్ట్ చేశాక ఇప్పుడు కరోనా రావడం తో షూటింగ్ ఆగిపోవడంతో కొరటాలకి బ్యాడ్ టైం నడుస్తోంది అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాలో విలన్ పాత్రలో తమిళ యాక్టర్ రెహమాన్ సెలక్ట్ అయినట్లు ఇటీవల ఫిలింనగర్ లో వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఇప్పుడు సినిమాలో మరో కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర తీరు తెన్నులు విని, ఇది దగ్గుబాటి రానా కి అయితే కరెక్ట్ గా సరిపోతుందని కొరటాల శివ తో చిరంజీవి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

 


సినిమాలో పాత్రకి మంచి డిమాండ్ ఉండటంతో చిరంజీవి ఇచ్చిన ఐడియా కు...కొరటాల ఆలోచిద్దామని అన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే సినిమాలో రాంచరణ్ పాత్రకు సంబంధించి అరగంట ఉంటుందని వార్తలు రావటం మనం విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా దగ్గుబాటి రానా కూడా సినిమాల్లో ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు రావడంతో మెగా అభిమానులు ఇది భారీ మల్టీస్టారర్ సినిమా అని కామెంట్లు చేస్తున్నారు.

 


అంతే కాకుండా 'సైరా నరసింహారెడ్డి' లో నటించిన మెగా డాటర్ నిహారిక ఈ సినిమాలో కూడా నటించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మాస్ కథతో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తరహాలో కొరటాల శివసినిమా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: