టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి రేస్ లో బాగా వెనకబడింది. చెప్పాలంటే సైజ్ జీరో తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది. భాగమతి సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న అనుష్క ఆ తర్వాత సినిమాకి మళ్ళీ దాదాపు రెండేళ్ళ గ్యాప్ తీసుకుంది. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిన నిశబ్ధం సినిమాలో ఒక ఛాలెంజింగ్ రోల్ చేసింది. ఈ సినిమా తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ భాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ తో థియోటర్స్ మూత పడే సరికి రిలీజ్ చేయలేదు.
అయితే చాలాసార్లు ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారని టాక్ రావడంతో కోన వెంకట్ క్లారిటీ ఇస్తూ థియోటర్స్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తామని తెలిపాడు. అయినా ఆ న్యూస్ మాత్రం వైరల్ అవుతూనే ఉంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా అనుష్క తర్వాత చేసే సినిమా ఏంటన్నది క్లారిటీ లేక చర్చించుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క ఒక తమిళ సూపర్ హిట్ సినిమా సీక్వెల లో నటించబోతుందని తెలుస్తుంది. అది కూడా లోకనాయకుడు కమల్ హాసన్ కి జంటగా అని తెలుస్తుంది.
గతంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతం మీనన్ కమల్ హాసన్ సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళు సాధించింది. ఆ సినిమానే రాఘవన్. తమిళంలో వేట్టైయాడు వేళైయాడు టైటిల్ తో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వేట్టైయాడు వేళైయాడు 2 ని రూపొందించాలని దర్శకుడు గౌతం మీనన్ సన్నాహాలు చేస్తున్నాడట.
ఈ సూపర్ హిట్ సీక్వెల్ కోసం అనుష్క ని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక నిశబ్ధం లో అనుష్క మూగ చెవిటి యువతిగా ఒక కొత్త పాత్రలో కనిపించబోతుంది. అనుష్క తో పాటు ఆర్ మాధవన్, అంజలి, శాలినీ పాండే ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హేమంత్ మధుకర్ ఈ సినిమాని తెరకెక్కించాడు.