మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మరో మూడు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు చిరు. అందులో మొదటగా లూసిఫర్ రీమేక్ గా సినిమా వస్తునంది. ఈ సినిమాను సాహో ఫేం సుజిత్ చేతుల్లో పెడుతున్నట్టు తెలుస్తుంది. సాహో సినిమా కథ రొటీన్ గా ఉంది కాని సినిమా మేకింగ్ బాగానే ఆకట్టుకుంది. అందుకే సుజిత్ కు రీమేక్ ఛాన్స్ ఇచ్చారు. కాని సుజిత్రీమేక్ కోసం చేస్తున్న వర్క్ అంతగా శాటిస్ ఫాక్షన్ గా లేదని తెలుస్తుంది.  

 

రీసెంట్ గా స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ ను సుజిత్ వినిపించగా అందులోనూ కొద్దిగా నచ్చని అంశాలు ఉన్నాయట. అదే విషయాన్ని సుజిత్ కు వివరించారట. మళ్లీ కొంత టైం అడిగి రీ రైట్ చేసేందుకు వెళ్లాడట. అయితే లూసిఫర్ రీమేక్ కు డైరక్టర్ సుజిత్ స్క్రిప్ట్ వర్క్ బాగానే ఉంటున్నా ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నట్టుగా ఉందట. అందుకే చిరు తనకి ఫైనల్ కాల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇచ్చిన టైం లోగా స్క్రిప్ట్ పూర్తి చేయాలని చెప్పారట.

 

చిరు ఆఫర్ టెంప్ట్ చేస్తున్నా సరే సుజిత్ ఈ ఛాన్స్ ను ఎలాగైనా బాగా వినియోగించుకోవాలని అనుకుంటున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ బాహుబలి తర్వాత ప్రభాస్ తో సాహో సినిమా చేసి మెప్పించాడు. కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకున్నా సాహోతో ప్రభాస్ కు మంచి జరిగిందని చెప్పొచ్చు. మరి సుజిత్ చిరు సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: