వదిలేసిన వాటి గురించి ఆలోచిస్తే కరెంట్ సిట్యువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే ప్రజెంట్ మూమెంట్ పైనే ఫోకస్ పెట్టాలంటారు. కానీ శర్వానంద్ మాత్రం విజయ్ దేవరకొండ సినిమా గురించి ఆలోచిస్తూ.. రిజెక్టెడ్ కథలకు ఒకే చెప్తున్నాడట. వేరే వాళ్లు వదిలేసిన కథలకు సైన్ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. 

 

కీరవాణి ఫ్యామిలీలో ఒక జోక్ ఉంది. కీరవాణి ట్యూన్స్ ఎవరికైనా నచ్చకపోతే వాటిని రాజమౌళి కోసం దాచిపెడతాడట. వాటిని జక్కన్నకు ఇచ్చేస్తాడట కీరవాణి. ఇప్పుడు శర్వానంద్ దక్కరకు కూడా ఇలాగే ఎవరో రిజక్ట్ చేసిన కథలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. వెంకటేశ్ పక్కన పెట్టేసిన కథతో శర్వా సినిమా చేయబోతున్నాడనే టాక్ వస్తోంది.  

 

శర్వానంద్ కు రీసెంట్ గా కిషోర్ తిరుమల ఒక స్టోరీ లైన్ వినిపించాడట. బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే సినిమా చేద్దాం అని చెప్పాడట  శర్వానంద్. అయితే శర్వాకి కిషోర్ వినిపించిన స్టోరీ.. ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా కథ అని ప్రచారం జరుగుతోంది. కిషోర్ మొదట వెంకటేష్ తో ఆడాళ్లు మీకు జోహార్లు చేయాలనుకున్నాడు. స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. అయితే దగ్గుబాటి కాంపౌండ్ లో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. 

 

లాక్ డౌన్ కు ముందు ఆర్ఎక్స్ 100 ఫేమ్ విజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమాకు సైన్ చేశాడు శర్వానంద్. అయితే ఈ మూవీని రవితేజతో తీయాలనుకున్నాడు అజయ్. అయితే అంతా ఒకే అనుకున్న తర్వాత రవితేజ నో చెప్పాడు. తర్వాత శర్వానంద్ లైన్ లోకి వచ్చాడు.  

 

విజయ్ దేవరకొండ కెరీర్ ను మార్చేసిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ వంగా మొదట ఈ కథను శర్వానంద్ కే నెరేట్ చేశాడు. కానీ శర్వా ఈ కథను వదులుకున్నాడు. అందుకే ఏ కథలో విషయం ఉందో అనే ఆలోచనతో శర్వానంద్ వాళ్లూ.. వీళ్లు వదిలేసిన కథలను ఒకే చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు సినీజనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: