తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా చిత్రాలు బాలీవుడ్ లోకి వెళ్ళి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంటున్నాయి. తెలుగులో సంచలనం విజయం సాధించిన అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ గా హిందీ రీమేక్ అయ్యి 300కోట్లకి పైగా వసూళ్ళు కలెక్ట్ చేసింది. ఇంకా టెంపర్ సింబా గా రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. 

 

 

అందుకే ఇక్కడ విజయం అందుకున్న చిత్రాల రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ రీమేక్ కి వెళ్లిన వాటిలో జెర్సీ, డీజే, ఆర్ ఎక్స్ 100, అల వైకుంఠపురములో భాగమతి తదితర చిత్రాలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో చిన్న చిత్రం కూడా చోటు దక్కించుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి తనయుడు ఎమ్ ఎమ్ సింహా ఇండస్ట్రీకి పరిచయమైన మత్తువదలరా సినిమా బాలీవుడ్ లోకి వెళ్తుందట.

 

 

కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలని దక్కించుకుంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో తన ముద్ర వేయడానికి రెడీ అవుతోన్న కీరవాణి పెద్ద కూమారుడు కాలభైరవ మత్తువదలరా సినిమాకి సంగీతం అందించాడు. కమెడియన్ సత్య ఈ సినిమాలో మరో హీరోలా కనిపించాడు. ఆద్యంతం నవ్వులన్నీ సత్యనే పండించాడు. నూతన దర్శకుడ్ఉ రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా కలెక్ట్ చేయలేకపోయినా ఇంపాక్ట్ ని మాత్రం క్రియేట్ చేయగలిగింది.

 

 

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ ఉన్నందున మేకర్స్ ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీలీనూ రితేష్ రానానే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: