బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకుని నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, సాహో సినిమాతో ఉత్తరాదిన తనకెంత బలముందో చూపించాడు. దక్షిణాదిన అంతగా హిట్ కాలేని సాహో సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకుని 150కోట్లకై పైగా కలెక్షన్లని అందుకుంది. దీంతో ప్రభాస్ నిజమైన నేషనల్ స్టార్ గా మారిపోయాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

 

రాధేశ్యామ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ డ్రామాగా రూపొందుతుంది. ఈ నెల 10వ తేదీన ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజై ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. ఈ ఫస్ట్ లుక్ ని చూస్తే ఇది ప్రేమకథా చిత్రమని తెలిసిపోతుంది. యూరప్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ లవ్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన చిత్రబృందం 2021లో ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు.

 

ప్రస్తుతం ఈ విషయం మీదే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. వచ్చే ఏడాది ఏ సీజన్ లో రిలీజ్ అవనుందనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానుందని అంచనా వేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ విషయంలో బాహుబలి సెంటిమెంటుని ఫాలో అయిన సంగతి తెలిసిందే.

 

బాహుబలి బిగినింగ్ రిలీజ్ అయిన తేదీని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిత్రబృందం సినిమా రిలీజ్ విషయంలో బాహుబలి కంక్లూజన్ రిలీజ్ తేదీ అయిన ఏప్రిల్ 28ని ఎంచుకుంటారని భావిస్తున్నారు. అప్పటి వరకు చిత్ర షూటింగ్ సహా అన్ని పనులు పూర్తవుతాయి. అందువల్ల బాహుబలి సెంటిమెంట్ తో స్టార్ట్ చేసి, ఆ సెంటిమెంట్ తో కంటిన్యూ అవుతారని అంటున్నారు. చూడాలి మరేం జరుగుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: