బాహుబలి సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆ సినిమాతో రైటర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి రెండు పార్టులతో పాటుగా ఆ వెంటనే వచ్చిన భజరంగి భాయిజాన్ సినిమాతో అక్కడ అదరగొట్టాడు. బాలీవుడ్ లో విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టులకు మంచి డిమాండ్ ఏర్పడింది. కంగనా రనౌత్ మణికర్ణిక సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇక కంగనా త్వరలో చేయబోతున్న ప్రాజెక్ట్ కు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడని అంటున్నారు. 

 

ఇదేకాకుండా బాలీవుడ్ లో విజయేంద్ర ప్రసాద్ హవా కొనసాగుతుంది. ఓ పెద్ద ప్రొడక్షన్ లో వరుసగా వెబ్ సీరీస్ ప్లాన్ చేసేలా.. వాటికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించేలా డీల్ సెట్ చేసుకున్నాడట. బాహుబలి సినిమాతో రైటర్ గా పాపులారిటీ తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ హిందిలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. బడా నిర్మాణ సంస్థ ఈ రైటర్ వాళ్ల దగ్గర పర్మినెంట్ రైటర్ గా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ఈయన రాసిన సినిమాలకు మంచి ఫలితాలు వస్తుండటంతో బాలీవుడ్ మేకర్స్ విజయేంద్ర ప్రసాద్ వెంట పడుతున్నారు.      

 

అంతేకాదు ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా రాజమౌళి నెక్స్ట్ తీసే మహేష్ సినిమా కథ కూడా ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ తో మళ్లీ రైటర్ గా తన సత్తా చాటాలని అనుకుంటున్న విజయేంద్ర ప్రసాద్ త్వరలోనే బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీ అవనున్నాడని తెలుస్తుంది. రైటర్ గా సూపర్ ఫాంలో ఉన్న విజయేంద్ర ప్రసాద్ డైరక్టర్ గా ఒకటి రెండు సినిమాలు ప్రయత్నించగా అది వర్క్ అవుట్ కాలేదు.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: