మన తెలుగు లో ఇప్పుడు ఉన్న వాతావరణం లో స్టార్ హీరోలు భారీ బడ్జెట్ అంటే చాలు చాలా వరకు కూడా భయపడే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. గతంలో మాదిరిగా అయితే ఇప్పుడు చాలా వరకు పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.. ఏ స్టార్ హీరో అయినా సరే చాలా వరకు తగ్గి సినిమాలు చేయడమే గాని డిమాండ్ చేసే అవకాశం అయితే లేదు అనే చెప్పాలి. ఇప్పుడు మరో వార్త ఏంటీ అంటే హీరోలకు అప్పుడే పారితోషికం ఇవ్వొద్దు అని సినిమా మొదలైన తర్వాత ఇవ్వాలి అని భావిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. 

 

ఒక సినిమా మొదలైన తర్వాత సినిమా లాభాల ఆధారంగా ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. అలా అయితేనే సినిమా  కు సంబంధించిన ఖర్చు అనేది తగ్గే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు జనాలు అని సమాచారం. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా సరే దాదాపుగా ఇదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు ముందు గానే వారికి భారీగా ఇచ్చేసి ఆ తర్వాత సినిమా నష్టాలు వస్తే మాత్రం కష్టం అని అందుకే ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తే ఏ గోలా ఉండదు అని నిర్మాతలు అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు అని టాక్. 

 

ఇప్పుడు మన తెలుగు లో ఎన్టీఆర్ విషయంలో  మహేష్ బాబు రామ్ చరణ్ ప్రభాస్ విషయంలో తర్వాతి సినిమాల విషయంలో ఇదే  నిర్ణయానికి వచ్చారు అని వారికీ కూడా ఇప్పటికే అసలు విషయం ఏంటీ అనేది చెప్పారు అని అంటున్నారు. ఇక టాలీవుడ్ లో సినిమాలకు పెట్టుబడి పెట్టే నిర్మాతలు కూడా చాలా వారు ఇప్పుడు తక్కువగానే ఉన్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: