దక్షిణాది సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నార్త్ బ్యూటీ తాప్సీ పన్ను. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్షన్లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మంది నాథం సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యింది ఈ ఢిల్లీ బ్యూటీ. తెలుగులో పెద్దగా సక్సెస్ లు రాకపోవటంతో ఉత్తరాది బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ మంచి విజయాలు అందుకుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ ఆకట్టుకున్న ఈ బ్యూటీ గత ఏడాది తన కెరీర్లోనే భారీ ప్రయోగాత్మక చిత్రం చేసింది.
గత ఏడాది సాండ్ కీ ఆంఖ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది తాప్సీ. తాజాగా ఈ సినిమా చేస్తున్న సమయంలో తన ఎక్స్పీరియన్స్ గురించి తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసింది తాప్సీ. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. `నా కెరీర్లోనే నేను చేసిన అతిపెద్ద ప్రయోగం సాండ్ కీ ఆంఖ్. దర్శకుడిగా తుషార్ హీరానందాని మొదటి ప్రయత్నం, నిర్మాతగా నిధి పార్మర్హిరా తొలి ప్రయత్నం, కెరీర్లోనే మొదటిసారి ఇద్దరు హీరోయిన్లు ఒకే సినిమాలో తమ వయసుకు మించిన పాత్రల్లో కనిపించారు.
ఈ సినిమాలో ఎంతోమంది మొదటిసారిగా బాలీవుడ్ స్క్రీన్పై తమ అదృష్టాన్నీ పరీక్షించుకున్నారు. ఈ మూవీతో నాకెన్నో గొప్ప గొప్ప ఙ్ఞాపకాలు ఉన్నాయి` అంటూ సినిమా ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుంది తాప్సీ. జాతీయ స్థాయిలో 30కి పైగా పోటిల్లో పాల్గొన్న భారత మాజీ మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించరు.
View this post on InstagramThe first look trial for #SaandKiAankh The first biggest experiment of my career, the first time director (our over enthu teddy ) @tusharhiranandani , first time producer @nidhiparmarhira and probably the first time 2 female actors in the prime of their career decided to depict Twice their age to share an equal screen space in a story never told before! Too many firsts in this one n I guess the beginner’s luck worked. Too many stories n memories attached with this one ❤️ #SaandKiAankh #Archive #QuarantinePost #Throwback