టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో అతి త్వరలో తెరకెక్కనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్, ఈ సినిమా ద్వారా మరొక హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి ఒక సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ మూవీ ని తీస్తున్న రాజమౌళి, అనంతరం చేయబోయే మహేష్ సినిమా కోసం, ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఒక పవర్ఫుల్ స్టోరీ ని రెడీ చేయిస్తున్నట్లు టాక్. 

IHG

ఎంతో భారీ లెవెల్లో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకొనే ని తీసుకునే ఛాన్స్ ఉందని కొద్దిరోజలుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో రాధే శ్యామ్ సినిమాతో బిజీ గా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్, దాని అనంతరం మహానటి ఫేమ్ నాగఅశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో కూడా దీపికానే హీరోయిన్ గా తీసుకుంటున్నారని ప్రచారం జోరుగాసాగుతోంది. ఇక ఇటీవల తాను మహానటి సినిమా చూశానని, దానిని ఎంతో అద్భుతంగా తీసిన దర్శకుడు అశ్విన్, అలానే ప్రధాన పాత్రలో నటించిన కీర్తి సురేష్ లను దీపికా మెచ్చుకుంటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేసారు దీపికా. దానితో ప్రభాస్, అశ్విన్ ల సినిమాలో దీపికా నటిస్తోందంటూ వార్తలు మరింతగా ఊపందుకున్నాయి. 

 

అయితే మహేష్ సినిమా విషయమై రాజమౌళి కూడా దీపికానే తీసుకోవాలని కొద్దిరోజుల క్రితం ఆమెతో ఫోన్ లో కాల్షీట్స్ విషయమై మాట్లాడారని అంటున్నారు. ఆ విధంగా ఓవైపు బాలీవుడ్ లో ఇప్పటికే పలు అవకాశాలతో బిజీ బిజీగా కొనసాగుతున్న దీపికా, అటు మహేష్, ఇటు ప్రభాస్ ల సినిమాల్లో ఒకేసారి అఫర్ రావడంతో ఎవరి సినిమా చేయాలో తేల్చుకోలేక లోలోపల కొంత నలిగిపోతున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నందువల్లనే దీపికా ఎటూ తేల్చుకోలేకపోతున్నారని, కాగా మరికొద్దిరోజుల్లో ఈ విషయమై ఆమె నుండి ప్రకటన ఒకటి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: