సురేందర్ రెడ్డి సమస్యలు డైలీ సీరియల్ లా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎంతమంది హీరోలను కాంటాక్ట్ చేసినా పని కావడం లేదు. స్టార్స్ నుంచి మొదలు పెడితే కుర్రాళ్ల వరకు ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. దీంతో స్ట్రగుల్స్ లో ఉన్న హీరోతో కలిసి ముందుకెళ్లడానికి ఫిక్స్ అయ్యాడు సురేందర్ రెడ్డి. 

 

సురేందర్ రెడ్డి లాక్ డౌన్ నుంచి మొదలుపెడితే అన్ లాక్ 2.0 వచ్చేవరకు వెతికినా హీరోలు సెట్ కావడం లేదు. చిరంజీవితో భారీ హిస్టారికల్ మూవీ సైరా తీశాక, ఇదే జోష్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు సూరి. బాహుబలి ప్రభాస్ తో సినిమా తీయాలని ప్లాన్ చేశాడు. వీళ్లిద్దరి కాంబోలో పాన్ ఇండియన్ మూవీ రాబోతుందనే ప్రచారం జరిగింది. కానీ ఈ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. 

 

సురేందర్ రెడ్డి-ప్రభాస్ కాంబినేషన్ తర్వాత రేసుగుర్రం కాంబో తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ ని రేసుగుర్రంలా చూపించి మెగాహిట్ కొట్టిన సూరి, మళ్లీ ఈ హీరోతోనే ఒక సినిమా తీస్తాడనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా మెటీరియలైజ్ కాలేదు. 

 

సరేందర్ రెడ్డి-రామ్ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో చర్చలు జరిగాయి. సూరి ఇస్మార్ట్ శంకర్ తో ఒక మాస్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేశాడనే మాటలు వినిపించాయి. ఈ మూవీ రేసుగుర్రం సీక్వెల్ లా ఉంటుందనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి మళ్లీ ఎలాంటి సమాచారం లేదు. సురేందర్ రెడ్డి మేకింగ్ యూనిక్ గా ఉంటుందని ఇండస్ట్రీలో మంచి ఓపీనియన్ ఉంది. పైగా సైరాతో బాలీవుడ్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 

 

సురేందర్ రెడ్డి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ తో కాకుండా ముగ్గురు టాప్ హీరోలతో సినిమాలు చేశాడు. చిరంజీవితో సైరా, charan TEJA' target='_blank' title='రామ్ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామ్ చరణ్ తో ధృవ, అల్లు అర్జున్ తో రేసుగుర్రం తీశాడు. ఈ స్టార్ల తర్వాత వరుణ్ తేజ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వచ్చింది. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు. 

 

చాలామంది హీరోలను కలిసి విసిగిపోయిన సురేందర్ రెడ్డి చివరకు రవితేజను కాంటాక్ట్ చేశాడట. వీళ్లిద్దరు హ్యాట్రిక్ కి రెడీ అయ్యారనే టాక్ వస్తుంది. షూటింగ్ లు ఊపందుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో కిక్, కిక్ 2సినిమాలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: