కరోనా వల్ల థియేటర్లు ఇప్పుడప్పుడే ఓపెన్ అయ్యే పరిస్థితి కనబడటం లేదు. అయినా సరే సెన్సేషనల్ డైరక్టర్ రాం గోపాల్ వర్మ ఈ టైంలోనే వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. క్లైమాక్స్, నగ్నం సినిమాలు ఏటిటిలో రిలీజ్ చేయగా లేటెస్ట్ గా థ్రిల్లర్, పవర్ స్టార్ అంటూ మరో రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. గురువు ఆర్జివి బాటలో ఇప్పుడు శిష్యుడు తేజా కూడా అదే బాటలో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడట. సీత సినిమా తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్టులను ఎనౌన్స్ చేసిన తేజా వాటితో పాటుగా వెబ్ మూవీస్ లను ప్లాన్ చేస్తున్నాడట.

 

తన సొంత నిర్మాణంలో తేజ సైబర్ క్రైం, డిజిటలైజేషన్ కు సంబందించిన కథలతో వెబ్ మూవీస్ చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే వీటికి సంబందించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. గురువు గారేమో ఏటిటిలో యూత్ ని ఎట్రాక్ట్ చేసే సినిమాలు రిలీజ్ చేస్తుంటే శిష్యుడు మాత్రం ఓ పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఒకప్పుడు ప్రేమకథలకు కేరాఫ్ అడ్రెస్ గా క్రేజ్ తెచ్చుకున్న తేజా కొన్నాళ్లు కెరియర్ లో వెనుకపడ్డా సరే నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. 

 

ఆ తర్వాత వెంటనే సీత సినిమా మళ్లీ తేజాకి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రానాతో ఒక సినిమా.. గోపిచంద్ తో మరో సినిమా ప్లాన్ చేశాడు తేజా. ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. ఇవే కాదు వెబ్ మూవీస్ కు సంబందించిన అప్డేట్స్ తో కూడా త్వరలో ఓ భారీ ఎనౌన్స్ మెంట్ చేస్తాడని తెలుస్తుంది.                       

మరింత సమాచారం తెలుసుకోండి: