టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో విడుదలైన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనెర్ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించారు. 2019, జూలై 18న విడుదలైన ఈచిత్రం సూసర్ డూపర్ హిట్ అందుకుంది. సరైన బొమ్మ పడితే మాస్ ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆదరిస్తారో ఈ మూవీ జబర్దస్త్గా ఫ్రూవ్ చేసింది.
వరుస ప్లాపుల్లో కూరుకుపోయిన రామ్కు, పూరి జగన్నాధ్కు మంచి సక్సెస్ను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా టైలర్ సైతం యూట్యూబ్లో దుమ్మురేపిందనే చెప్పాలి. పూరీ మార్క్ టేకింగ్కి రామ్ హై ఓల్టేజ్ యాక్షన్తోడు కావడంతో ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో అరాచకం సృష్టించింది. పూరి డైలాగులు, రామ్ చూపిస్తున్న టెంపో, ట్రైలర్ కట్ చేసిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇస్మార్ట్ ట్రైలర్ యూట్యూబ్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది.
ముఖ్యంగా ఈ సినిమా టైలర్లో రామ్ చెప్పిన డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఇక మరి భారీ అంచనాల మధ్య పక్కా మాస్ మసాలా అంశాలతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొత్తానికి మంచి విజయం అందుకుంది. అలాగే తాను క్లాస్, మాస్ రెండింటిని మెప్పించగలనని హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్తో సమాధానం చెప్పారు. ఈ సినిమా కోసం లుక్ నుంచి మాట, నడక, నడత మార్చుకోవడంతో పాటు వాటిని తెరపై ప్రజెంట్ చేయడంలోనూ రామ్ సక్సెస్ అయ్యాడు.