కన్నడ బ్యూటీ ,రష్మిక మందన్న.. స్టార్ హీరోయిన్ సమంత దగ్గరినుండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది. అనంతరం ఈఛాలెంజ్ కు యువ హీరోయిన్లు రాశి ఖన్నా ,కళ్యాణి ప్రియదర్శన్ లను నామినేట్ చేసింది. ఈసందర్భంగా రష్మిక మొక్కలు నాటిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక ఛలోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా రష్మిక ఇటీవల సరిలేరు నీకెవ్వరు తోకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈసినిమా తరువాత  భీష్మతో ఈఏడాది వరసగా రెండో  హిట్ కొట్టిన రష్మిక నెక్స్ట్  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్పలో నటించనుంది.
 
ఈ చిత్రంలో రష్మిక పల్లెటూరి అమ్మయిగా కనిపించనుంది. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈసినిమా తోపాటు రష్మిక , తెలుగులో మరి కొన్ని ప్రాజెక్ట్ లకు సైన్ చేసిందని సమాచారం. త్వరలోనే ఆసినిమాల విషయంలో క్లారిటీ రానుంది. ఇక ప్రస్తుతం తమిళంలో రష్మిక , కార్తి సరసన సుల్తాన్ లో నటిస్తుంది. కోలీవుడ్ లో ఆమెకు ఇదే మొదటి సినిమా. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: