మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం `ప్రతిరోజూ పండగే`. రాశి ఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించి ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ పతాకంపై బన్ని వాసు నిర్మించారు. మరణానికి చేరువలో వున్న తాతను చివరిక్షణం వరకూ సంతోషంగా ఉంచాలని తాపత్రయపడే మనవడి కథ `ప్రతిరోజూ పండగే`.
ఈ కథలో తండ్రిగా, తాతగా సత్యరాజ్ తన పాత్రలో జీవించాడు. తాత కోసం కుటుంబ సభ్యులందరి మనసులు మార్చే మనవడి పాత్రలో నటించిన సాయి తేజ్ అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా టైలర్ సైతం యూట్యూబ్లో దుమ్మురేపిందనే చెప్పాలి. ట్రైలర్ ద్వారా సినిమాపై మంచి హైప్ కూడా క్రియేట్ చేసింది చిత్రయూనిట్. ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేయడంతో.. యూత్ మొదలుకొని ఫ్యామిలీ ఆడియన్స్కు సైతం బాగా కనెక్ట్ అయింది.
లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉండి, కేవలం అయిదు వారాలు మాత్రమే లైఫ్ స్పాన్ ఉన్న సత్యరాజ్ చివరి కోరికగా విదేశాల్లో ఉండే తన వారిని చూడాలనుకోవడం, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. మనవడు వచ్చి తాతని సంతోష పరచడం.. ఇది సినిమా కథ అని ట్రైలర్లో చూపించారు. కంటెంట్తో పాటు కామెడీ కూడా పీక్స్లో ఉండడంతో.. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో ఏకంగా 8.1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మొత్తానికి ట్రైలర్ సినిమా ప్రమోషన్స్ మేజర్ అసెట్ అయిందని చెప్పుకోవచ్చు.