టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ మీకు అందిస్తుంది. కామ్ గోయింగ్ పద్దతిని ఫాలో అవుతున్న మహేష్ బాబు చాలా కాలం తరువాత సీరియస్ అయ్యాడట. గత వారం రోజులుగా ఆగడు మూవీలోని లీడ్ రోల్ చేస్తున్న ప్రకాష్ రాజ్ పాత్రను మార్చేసి, సోనూ సూద్ ను తీసుకోవటం వంటి మార్పులు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఫిల్మ్ డైరెక్టర్స్ డిపార్ట్ మెంట్ పై, అలాగే సెట్ బాయ్స్, ఇతర టెక్నిషియన్స్ పై ప్రకాష్ రాజ్ చేసే ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉందని చిత్రయూనిట్ లోని చాలా మంది బహిరంగంగానే అంటున్నారు. దీంతో ఆగడు మూవీకు సంబంధించిన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ప్రకాష్ రాజ్ ను తప్పించటమే కాకుండా, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి తనను నిషేధించాలంటూ ప్రయాత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ప్రకాష్ రాజ్, మహేష్ బాబుకు ఫోన్ చేసి ప్రవేట్ గా మాట్లాడాడంట. మళ్ళి ఆగడు మూవీలో నటించాలని, తనకు ఆ పాత్ర ఎంతో నచ్చిందని అందుకే ఆడుగుతున్నట్టు ప్రకాష్ రాష్ వివరించాడట. అయితే అందుకు మహేష్ బాబు నో అని చెప్పటమే కాకుండా ప్రకాష్ రాజ్ కు బాగానే క్లాస్ పీకినట్టు సమాచారం. ప్రకాష్ రాజ్ పై వస్తున్న వార్తలను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్ కూడా ధృవీకరించాడు. త్వరలోనే ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కఠినమైన నిర్ణయాన్ని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ తరహా చర్యలు ప్రకాష్ రాజ్ పై ఇప్పటికే పలుమార్లు జరిగాయి. అయినా ప్రకాష్ రాజ్ ప్రవర్తన మాత్రం ఇంకా మారలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: