హీరోయిన్ సంగీత పేరు తెలియని వారుండరు. ‘ఖడ్గం’ సినిమాలో ఒకేఒక్క సినిమా ఛాన్స్ అంటు ఆమె చేసిన పాత్ర సంగీతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అటువంటి హీరోయిన్ పై చెన్నైకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు సంగీత ఆమె భర్త క్రిష్‌ దంపతులపై కోర్టు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం వలసరవాక్కం పోలీసులు సంగీత, ఆమె భర్త క్రిష్‌, భాస్కరన్‌, ఆమె భార్య కలైలపై బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా మాట్లాడటం. అనాగరికంగా నడుచుకోవటం, హత్యాబెదిరింపు తదితర కేసులు నమోదు చేశారు అని వార్తలు వస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళితే చెన్నై వలసరవాక్కం జానకీనగర్‌లోని నటరాజన్‌ నివాసంలో ఉషా శంకర్‌నారాయణన్‌ అనే అవివాహితుడు అద్దెకుంటున్నాడు. ఇతని ఇల్లు నటి సంగీత ఇంటికి ఎదురుగా ఉంటుంది. శునకాల ప్రేమికుడైన శంకర్‌నారాయణన్‌ నాలుగు వీధి కుక్కలనుపెంచు కుంటున్నాడు.. ఇదిలా ఉంటే ఆయన ఎదురింటిలో భాస్కరన్‌ అనే వ్యక్తి మేలుజాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే శంకర్‌నారాయణన్‌ కుక్కలు భాస్కరన్‌ కుక్కను చూసి మొరుగుతున్నాయంటూ ఇద్దరి మధ్య తరుచుగా వివాదాలు వస్తూ ఉండేవి. అదే సమయంలో భాస్కరన్‌ ఇంటి పక్క నివాసం ఉంటున్న సినీ నటి సంగీత, ఆమె భర్త క్రిష్‌లు భాస్కరన్‌కు మద్దతుగా మాట్లాడటమే కాకుండా.. ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయాలని, లేదంటే హత్య చేస్తామని బెదిరించినట్లు శంకర్ నారాయణ కోర్టుకెక్కి, కోర్టు ఆదేశాలతో సంగీత దంపతుల పై పోలీసు కేసు పెట్టారు. దీనితో సంగీత కోర్టుల చుట్టూ, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతోందని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు లేవు కాబట్టి ఈ కుక్కల వ్యవహారంలో చాల బిజీగా గడుపుతోంది సంగీత.  

మరింత సమాచారం తెలుసుకోండి: