పొలిటికల్ మెగాస్టార్ గా ఎదుగుదామని ఎన్నో కలలు మరెన్నో ఎత్తు గడలు వేసిన చిరంజీవి తన ప్రతిప్రయత్నంలో పరాజయంపాలు కావడమే కాకుండా బోలెడు అపకీర్తిని కుడా మూట గట్టుకున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రస్తుతానికి చేయడానికి ఏమీ పని లేకపోవడంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న తన 150వ సినిమాపై దృష్టి సారించాడు అన్న విషయం తెలిసిందే.  వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నాడు. ఇందులో భాగంగా 150వ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ పెంచే విధంగా ఉండాలని ఆయన రకరకాల కధలు వింటూ కాలం గడుపుతున్న చిరంజీవి మరింత బెస్ట్ స్టోరీ కావాలని కోరుకుంటున్నాడట.  ఇందుకోసం ఆయన కథా రచయితలకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. తనకు పర్ ఫెక్టుగా సూటయ్యే అద్భుతమైన కథ అందిస్తే రూ. 1 కోటి పారితోషికం ఇప్పిస్తానని చెబుతున్నాడట. మరి చిరంజీవిని మెుప్పించి ఆ కోటిపారితోషికం అందుకోబోయే రచయిత ఎవరు? అనేదిరానున్న కాలంలో తేలుతుంది. ఈ మధ్య కాలంలో దర్శకులు బోయపాటి మణిరత్నం ల కధలు విన్న చిరంజీవి ఇక పెద్ద దర్శకుల కధలతో తన పని తీరేలా లేదని కొత్త రచయితలకు ఈ బంపర్ ఆఫర్ ఇచినట్లు అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: