కేరళ అమ్మాయి సుమ ఇప్పుడు తెలుగులో బిజీగా ఉన్నది. సినిమా కార్యక్రమాలు, టీవీ ప్రోగ్రామ్స్ తో ఆమె చాలా బిజీగా ఉంది. కాగా, తెలుగు అబ్బాయి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్నా కేరళ వంటలను సుమ మర్చిపోలేదు. కేరళలో అరటి పండును ఉడక బెట్టుకుని తింటారట. తన పిల్లలకు కూడా సుమ అప్పుడప్పుడు ఇలా పెడుతుందట. దీంతో ‘అరటి పండును కూడా ఉడకబెట్టుకుని తినే టైపమ్మా మీరు’ అని రాజీవ్ తన భార్యను ఆటపట్టిస్తుంటాడట. ఈ విషయాన్ని సుమ ఒక టివీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్వూలో వెల్లడించింది. అలాగే, హీరోయిన్లకన్నా యాంకర్లు ఎక్కువ సంపాదించే రోజు రావాలని సుమ కోరుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: