త్రిషకు టాలీవుడ్ లో లైఫ్ ఇచ్చిన ‘వర్షం’ ఇప్పుడు ఆమె పై పగ పట్టింది. ప్రస్తుతం త్రిష నందమూరి బాలకృష్ణ తో ‘గాడ్సే’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాల రోజుల తరువాత ఒక భారీ సినిమాను బాలకృష్ణతో చేస్తున్న త్రిషకు ఆదిలోనే అడ్డంకులు ఎదురౌతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతున్న ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ కోసం హుషారుగా వచ్చిన త్రిషకు ఆ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా త్రిష మేకప్ వేసుకుని కూడ అడుగు బయట పెట్టడానికి వీలు లేకుండా రాజమండ్రిలోని ఒక ప్రముఖ హోటల్ లో బందీగా మారిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్యతో ఒక రొమాంటిక్ సాంగ్ మరికొన్ని ముఖ్య సన్నీ వేషాలు నటించి ఇరగాదీద్దామని అనుకున్న త్రిష ఆశల పై వర్షం తన ప్రతాపాన్ని చూపెట్టింది. అనుకోని ఈ అవాంతరానికి షాక్ అయిన ఈ ఫిలిం యూనిట్ వర్షాలు ఇలాగే కొనసాగితే మారేడిమిల్లి ప్రాంతం అంతా బురదగా మారుతుంది కాబట్టి వర్షాలు అదుపులోకి రాకపోతే ఈ షూటింగ్ ను హైదరాబాద్ లో కొనసాగిద్దామని భావిస్తున్నారని టాక్. ఎదిఎమైనా త్రిషకు బ్రేక్ ఇచ్చిన వర్షమే ఇప్పుడు ఆమె పై పగ పట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: