సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దశాబ్ధ కాలం పాటు స్టార్ డం ని కొనసాగించిన హీరోయిన్ త్రిష. త్రిష ఫిల్మ్ కెరీర్ లో ఎంతటి స్టార్ డం ఉందో, అదే విధంగా బ్లాక్ షేడ్స్ కూడ ఉన్నాయి. కాని తనపై ఎన్ని నెగిటివ్ వార్తలు వచ్చినా, ఎన్ని రకాల రూమర్స్ వచ్చినా, త్రిష ఏ మాత్రం భయపడలేదు కదా, కనీసం స్పంధించాల్సిన అవసరం లేదు అనే భావనతోనే ఉంటుంది. ఈ విషయంలో త్రిషని చాలా మంది మెచ్చుకుంటారు. అయితే ప్రస్తుతం త్రిష గుట్టుగా చేసుకుంటున్న ఓ విషయం, బయటకు తెలిసిపోయింది. కొద్ది కాలం క్రితం తమిళ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ తో అమ్మడి వివాహ నిశ్చితార్థం జరిగిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో? లేదో? అనే విషయాన్ని చెప్పకుండా, "ఎవరికి తోచింది వారు రాసుకుంటున్నారు.." అని మాత్రమే త్రిష క్లారిటీ ఇచ్చింది. తాజాగా కోలీవుడ్ మీడియా ఇన్వెస్టిగేషన్ లో త్రిష నిజంగానే ఆ బిజినెస్ పర్సనాలిటితో ఎఫైర్ ని నడుపుతందంటూ మేటర్ ని లీక్ చేసింది. కోలీవుడ్ మీడియా వద్ద బిజినెస్ మెన్ వరుణ్ మణియన్, త్రిష కి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నట్టు చెబుతన్నారు. దీంతో త్రిష ఈ విషయంపై స్పంధించింది. "అందరూ బాయ్ ప్రెండ్స్ తో ఏవిధంగా ఉంటారో, మేము కూడ అదే విధంగా రిలేషన్ ని మెయింటెన్ చేస్తున్నాము తప్పితే, ఇందులో ఎటువంటి ప్రత్యేకత లేదు. ఇద్దరి మధ్య పెళ్ళి చేసుకునే ఆలోచన ఉందో లేదో? అది మీకే తెలియాలి" అంటూ క్లారిటి ఇచ్చింది. మొత్తానికి త్రిష ఆ బిజినెస్ మెన్ తో డేటింగ్ వ్యవహారాన్ని చాలా గుట్టుగా నడుపుతుందనేది.. కోలీవుడ్ మీడియా టాక్. దీంతో ఇంత కాలం త్రిష ప్రేమ వ్యవహారం అంతా మీడియా సృష్టే అని అనుకున్న సినీ ప్రేక్షకులు, ఇప్పుడు మీడియా చెబుతున్న దాంట్లో నిజం ఉంది.. అని నమ్ముతున్నారంట. మొత్తంగా త్రిషం స్పీడు చూస్తుంది వరుణ్ మణియన్ తో పెళ్ళికి రెడీ గా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: