యముడికి మొగుడు... ఒకప్పటి మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా. ఇదే పేరుతో మరో కొత్త సినిమాను అల్లరి నరేష్ హీరోగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయిక రిచా పనాయ్. ఉత్తరాది నుంచి వచ్చిన ఈ భామకు నటన అంటే చాలా ఇష్టమూ గౌరవమూ కూడానట. అందుకే, తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుందట. తెలుగు నేర్చుకోవడం కూడా మొదలుపెట్టిందట. నరేష్ ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నింటిలోకీ భారీ చిత్రంగా చెబుతున్న ఈ సినిమాకు రిచా పనాయ్ సొంత గొంతు వరమౌతుందో శాపమౌతుందో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: