ఈవారం విడుదలై ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేక సతమతమవుతున్న ‘ముకుంద’ సినిమా ఈ వీకెండ్ తరువాత ఏ స్థాయిలో నిలబడుతుంది అనే ప్రశ్నలు ఈ సినిమాను తీసిన వారికే కాకుండా ఈ సినిమాను అత్యధిక మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లను బయపెడుతోంది అనే వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయిన ఈ సినిమాకు కూడా వివాదాలు తప్పడం లేదు.  లేటెస్ట్ గా వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా పై సిరిసిల్ల పోలీసు స్టేషన్ లో కొందరు ‘ముకుంద’ సినిమా తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని కేసు వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కృష్ణుడుని ఆరాధించే యాదవ సామజిక వర్గం వారు ‘ముకుంద’ పై కోపంగా ఉన్నారని టాక్. మంచి కుటుంబ సినిమాలకు చిరునామాగా ఉండే శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు కూడా ఇలా వివాదాలు చుట్టు ముట్టడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ‘ముకుంద’ సినిమాతో పోటీగా వచ్చిన నితిన్ ‘చిన్న దానా నీకోసం’ సినిమాకు కూడా ఫెయిల్యూర్ టాక్ రావడంతో సంక్రాంతి సినిమాల హడావిడి ప్రారంభం కావడానికి ఇంకా 15 రోజుల సమమయం ఉన్న నేపధ్యంలో మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచి ఏదోవిధంగా ‘ముకుంద’ కలెక్షన్స్ పడిపోకుండా ‘ముకుంద’ ఫిలిం యూనిట్ ఈ సినిమా విజయయాత్రను మెగా హీరో వరుణ్ తేజ్ పరిచయ యాత్రగా మార్చి ఇరు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలను టచ్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రయోగం అయినా ‘ముకుంద’ ను రక్షిస్తుందేమో చూడాలి..    

మరింత సమాచారం తెలుసుకోండి: