ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, డైరెక్టర్స్ మధ్య భీకరమైన వార్ జరుగుతుంది. ఓ పక్క హీరోలు గొప్ప అంటూ డైరెక్టర్స్ ని డామినేట్ చేస్తూ హీరోయిజం చూపే హీరోలు చాలా మందే ఉన్నారు. మరో వైపు టాప్ డైరెక్టర్స్, వారి చిత్రాలలో హీరోలు లేకపోయినా పర్వాలేదు, మూవీని బ్లాక్ బస్టర్ లుగా చిత్రీకరిస్తాం అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు వర్గాలుగా హీరోలు, డైరెక్టర్స్ మారిపోయారు. ఆ లిస్ట్ లో డైరెక్టర్ రాజమౌళి మొదటి వరుసలో ఉంటాడు. గతంలో టాప్ హీరోలతో మూవీలని తీసిన రాజమౌళి, ప్రస్తుతం మాత్రం టాప్ హీరోలని ఏ మాత్రం ఎంకరేజ్ చేయడం లేదు. తను ఏదైతే కథని అనుకుంటున్నాడో, ఆ కథకి సరిపోయే క్యారెక్టర్స్ ని మాత్రమే తీసుకుంటున్నారు. ఆ క్యారెక్టర్స్ లో టాప్ హీరోలు ఉండొచ్చు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండొచ్చు. వీళ్ళెవరూ కాకుండా చివరికి జంతువులు కూడ ఉండొచ్చు. దీంతో రాజమౌళి కోసం వెయిట్ చేసిన టాప్ హీరోలు, చివరికి రాజమౌళి అంటేనే చిరాకు అనే విధంగా మారిపోయారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ మధ్య కూడ భీకరమైన వార్ జరుగుతుంది. ఎవరు గొప్ప అన్నదే వీరి టార్గెట్ పాయింట్. ఇప్పటి వరకూ రాజమౌళి ఎన్నో విభిన్న కోణాలతో మూవీలను తెరకెక్కించాడు. కాని ఫిమేల్ ఓరియంటెడ్ మూవీని మాత్రం తెరకెక్కంచలేదు. రాజమౌళి కోరిక ప్రకారం, ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కించాలని ఆలోచనలు చేస్తున్నాడు. అది జానపదమా, చారిత్రకమా, ట్రెండీనా అనేది పక్కన పెడితే, మొత్తానికి లేడీ ఓరియంటెడ్ మూవీ అయితే తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. బాహుబలి రెండు భాగాలు అనంతరం, రాజమౌళి.. సమంతని లీడ్ రోల్ లో చూపిస్తూ ఓ మూవీని తెరకెక్కించే ఛాన్స్ ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: