నిన్న  మూవీ ఆర్టిస్ట్  అసోసియేషన్  నూతన అధ్యక్షడిగా రాజేంద్రప్రసాద్ చేత  మురళీమోహన్ ప్రమాణ స్వీకారం  చేయించాడు.  ఈ  ప్రమాణస్వీకారం చేసిన  తరువాత  రాజేంద్ర  ప్రసాద్ మాట్లాడుతూ  తన సహజమైన  వ్యంగ్య  ధోరణిలో  హేమను  ఉద్దేశించి చూస్తూ  వేసిన రివర్స్ పంచ్  డైలాగ్స్  విన్న  వారికి ‘మా’ ఎన్నికలలో  జరిగిన రచ్చను రాజేంద్రప్రసాద్ ఇప్పటిలో  మరిచిపోయే  అవకాశం ఉన్నట్లుగా అనిపించ లేదు.  


రాజేంద్రప్రసాద్


మా సంస్థ అధ్యక్షుడిగా తానూ చేయబోయే కార్య క్రమాలను వివరిస్తూ  రాజేంద్రప్రసాద్  తాను  మా  సంస్థ అధ్యక్షుడిగా విజయం  సాధించడానికి నటి  హేమ  ఎన్నికలసమయంలో అర్ధరాత్రి  టీవీ ఛానెల్ ముందు సృస్టించిన రగడ తనకు  బాగా కలిసి వచ్చి తన విజయానికి పరోక్షంగా సహకరించిందని హేమ పై తన సహజధోరణిలో నవ్వుతూ కామెంట్స్ చేసాడు రాజేంద్రప్రసాద్. 


‘మా’ సంస్థ సభ్యులు


అనుకోని ఈమాటలకు హేమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.  ఆతరువాత రాజేంద్రప్రసాద్ సద్దుకుని మాట్లాడుతూ తమ ‘మా’ సంస్థ సభ్యులు అంతా ఒకే కుటుంబం వారిమని అంటూ  తన సెటైర్లను  ఆపివేసాడు. ఇదేసందర్భంలో మాట్లాడిన నాగబాబు రాజేంద్రప్రసాద్ చేప్పట్టబోయే కార్యక్రమాలకు మద్దతు తెలుపుతూ తన మెగా కుటుంబ హీరోలు చరణ్ అల్లుఅర్జున్  వరుణ్  తేజ్ లు ప్రకటించిన 6 లక్షల మా సంస్థ  విరాళాలను తెలియచేసి రాజేంద్రప్రసాద్ కు మరోసారి బాసటగా నిలబడ్డాడు నాగబాబు.


ఇదే సందర్భంలో మాట్లాడిన ‘మా’ మాజీ అధ్యక్షుడు  మురళీమోహన్  ‘ఎన్నికల వరకే విభేదాలు ఇప్పుడంతా కలిసే ఉన్నాం. మేమంతా ఒక్కటే ‘మా’లో ఎలాంటి విభేదాల్లేవు’ అంటూ గతంలో చెప్పిన మాటలనే మళ్ళీమళ్ళీ రిపీట్ చేసాడు. అయినా ఈ మాటలు పట్టించుకోకుండా రాజేంద్రప్రసాద్ హేమ పై వేసిన సెటైర్లను బట్టి ‘మా’ ఎన్నికలు ముగిసినా ‘మా’ విభేదాలు కొనసాగుతున్నాయి అనే అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: